Breaking : మునుగోడు బైపోల్‌.. మరోసారి చౌటుప్పల్‌లో పోస్టర్ల కలకలం..

-

మునుగోడులో పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే.. ఇటీవల కాంట్రాక్ట్‌పే పేరుతో మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. అయితే..దీనిపై ఫోన్‌ పే కూడా స్పందిస్తూ.. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే.. ఇప్పుడు మరోసారి నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, చండూరులో పోస్టర్‌లు కలకలం రేపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలు రోజురోజుకు వివాదాలు బాటలో నడుస్తున్న నేపథ్యంలో నేడు తాజాగా మునుగోడు నియోజకవర్గంలో మరోసారి పోస్టర్లు కలకలం మొదలైంది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి (నేడే విడుదల….షా సమర్పించు…18,000 కోట్లు… దర్శకత్వం: కోమటిరెడ్డి అంటూ సినిమా పోస్టల్ తరహాలో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

మునుగోడు నియోజకవర్గం చుండూరులో వెలసిన ఈ పోస్టర్లు వివాదాలు రేకెత్తించాయి, రాత్రికి రాత్రే ఈ పోస్టర్లను తొలగించారు బీజేపీ కార్యకర్తలు. ఇదిలా ఉంటే.. చౌటుప్పల్‌లో సైతం ‘హుజురాబాద్, దుబ్బాక ప్రజల్లాగా మోసపోవద్దు’ అంటూ పోస్టర్లు వెలిశాయి. అయితే వీటిని మునిసిపల్‌ సిబ్బంది తొలగిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version