హైదరాబాద్ లో మరో నేపాలీ గ్యాంగ్ హల్చల్..

-

హైదరాబాద్‌లోని నాచారంలో మరో నేపాలీ గ్యాంగ్ హల్‎చల్ సృష్టించింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటి నగర్ లో భారీ చోరీకి పాల్పడ్డారు. నాచారం పీఎస్ పరిధి లో మత్తు మందు ఇచ్చి చోరీకి నేపాల్ కి సంబందించిన పనిమనుషులు పాల్పడ్డారు. ఇంట్లో వారు శుభకార్యానికి వెళ్ళగా అదును చూసుకొని, ఇంట్లో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చిన దుండగులు, 10 లక్షల నగదు తో పాటు 18 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నేపాలీ జంటని పనికి కుదిర్చిన ఏజెన్సీ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇలాంటి చోరీ నగరంలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి జరిగింది. ముందు చోరీ చేసిన ఒక గ్యాంగ్ ని నేపాల్ బోర్డర్ లో పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version