ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలి : చంద్రబాబు

-

ముందస్తు ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల్లో రోజు రోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని సీఎం జగనుకూ అర్థమవుతోందని తెలిపారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కూడా బూటకమేనని ప్రజలకూ అర్థమవుతోందన్నారు. ఆ వర్గం.. ఈ వర్గం అని లేకుండా అందరిలోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తోందని తెలిపారు.

వీటన్నింటినీ గమనించిన జగన్.. ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారని.. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలు టీడీపీ పైనే ఆశలు పెట్టుకున్నారని వెల్లడించారు. గ్రామాల్లో టీడీపీకి స్వాగతాలు.. గడపగడపలో వైసీపీ నేతలకు నిలదీతలే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో గ్రామ స్థాయి వరకు ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యకుండా ఇంటింటికీ వెళ్లాలని పిలుపు ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version