Breaking : విశాఖకు చేరుకున్న జనసేనాని

-

ప్రధాని నరేంద్ర మోడీ నేడు, రేపు విశాఖలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే విశాఖకు మోడీ చేరుకున్నారు. అయితే.. మోడీతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశంకానున్న ఈ నేపథ్యంలో జనసేనాని సైతం విశాఖ చేరుకున్నారు. అయితే.. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పవన్ తన వాహనంలో నేరుగా నోవోటెల్ హోటల్ కు పయనమయ్యారు. పవన్ ఈ రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ అపాయింట్ మెంట్ ను ఖరారు చేస్తూ పవన్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి టెలిఫోన్ ద్వారా సమాచారం అందింది.

నేటి సాయంత్రం నుంచి విశాఖలో అందుబాటులో ఉండాలని ఆ సమాచారం సారాంశం. కాగా, ప్రధాని మోదీతో భేటీ కోసం పవన్ వివిధ అంశాలపై కసరత్తులు చేసి ఐదు పేజీల నోట్ సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ప్రధానంగా, ఏపీలో బీజేపీతో పొత్తుపై పవన్ మరింత స్పష్టత కోరతారని భావిస్తున్నారు. ఈ దిశగా రోడ్ మ్యాప్ ను అడిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు వైసీపీ వ్యతిరేక ఓటును టీడీపీకి వెళ్లనివ్వబోమని చెబుతున్న నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తాయన్న విషయం అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version