పయ్యావుల కేశవ్ గారి గన్ మెన్లను తొలగించలేదు – అనంతపురం పోలీస్ శాఖ

-

టిడిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గన్ మేన్లను తొలగించినట్లు గా వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పయ్యావుల కేశవ్ కు భద్రతలో భాగంగా ఉన్న వన్ ప్లస్ వన్ గన్మెన్లను తొలగించినట్లు గా వార్తలు వచ్చాయి. అయితే ఫోన్ టాపింగ్ విషయమై ప్రభుత్వానికి పయ్యావుల కౌంటర్ ఇచ్చాకే సెక్యూరిటీని విత్డ్రా చేసిందని టిడిపి పార్టీ దీనిపై ఆరోపణలు చేసింది.

అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పయ్యావుల కేశవ్ గతంలో పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో.. పయ్యావుల కేశవ్ భద్రతను ఉపసంహరించారు అని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు అనంతపురం పోలీసులు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ భద్రతలో భాగంగా1+1 గన్మెన్లను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న భద్రత ను అలాగే కొనసాగిస్తామని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version