రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు మృతి

-

పెద్దపల్లి జిల్లా కొత్తపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి గ్రామ శివారులో దుర్గయ్య, శ్రీనివాస్, వేణు, శీను అనే నలుగురు కూలీలు రైల్వే పట్టాలకు గ్రీసు రాస్తున్నారు. తమ పనిలో నిమగ్నమైన ఈ కార్మికులు ఎదురుగా వస్తోన్న రైలును గమనించలేదు. అతివేగంగా వచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అనే కూలీ మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

హుస్సేన్‌మియా వాగువద్ద ట్రాక్ మరమ్మతుల చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాలు గుర్తుపట్టనంత దారుణంగా మారిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్మికుల మృతితో వారి కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version