అది దీక్షకాదు… లోకేష్ కోసం చంద్రబాబు చేసే చేతబడి : పేర్ని నాని

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసే దీక్ష… కొంగ జపం లాంటిదని ఎద్దేవా చేశారు. అసలు అది దీక్ష కాదని… లోకేష్ కోసం నారా చంద్రబాబునాయుడు చేసే చేతబడి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పేర్నినాని.

ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన పేర్ని నాని మాట్లాడుతూ… బూతులను సమర్ధిస్తూ చంద్రబాబు దీక్షలు చేస్తున్నారా ? అని మంత్రి పెర్నీ నాని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రజా స్వామ్యం పరిఢ విల్లుతుండ బట్టే చంద్రబాబు, లోకేష్ ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు. అధికారం కోసం ఈ స్థాయిలో దిగజారటం అవసరమా ? అని నిలదీశారు.

ఒకసారి అంతరాత్మ ను చంద్రబాబు ప్రశ్నించుకోవాలన్నారు. బీజేపీ అధ్యక్షుడు, జడ్ ప్లస్ క్యాటగిరీ లో ఉన్న అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు టీడీపీ గూండాలు ఆయన కారును బద్దలు కొట్టారని.. ఆ రోజు ఆర్టికల్ 356 అమలు చేయమని మోడీ ని ఎందుకు అడగ లేదని ప్రశ్నించారు. ఢిల్లీ వెళితే అమిత్ షా మీకు ఈ విషయాలు గుర్తు చేసి గడ్డి పెట్టరా ?? అని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version