మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి పేర్నినాని

-

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని నేడు మచిలీపట్నంలో పర్యటించారు. అక్కడ ఆయన ఒక వృద్ధురాలిని కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో వెళుతుండటం చూశారు. దాంతో ఆయన మనసు కరిగిపోయింది. ఆమెకు చెప్పులు కొనిచ్చి మానవత్వం ఎమ్మెల్యే పేర్ని నాని.

ఆ సమయంలో పేర్ని నాని కారులో అటునుండి పర్యటిస్తున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం పట్ల ఆయన దృష్టిని మళ్లింది . దీంతో ఆయన వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలు తెలుసుకున్నారు. ఆమె పేదరాలు అని తెలుసుకున్న ఆయన, ఆమెను ఓ చెప్పుల షోరూంకు తీసుకెళ్లి, ఆమెకి నచ్చిన చెప్పులు కొనిపెట్టారు నాని. చెప్పులు ఎలా ఉన్నాయమ్మా… లూజుగా ఉన్నాయా… సరిపోయాయా అంటూ ఆమెని అడిగారు. చెప్పులు కొనిచ్చిన పేర్ని నానికి ఆ వృద్ధురాలు చేతులు జోడించి వందనాలు తెలుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version