రిపోర్టర్ కి చుక్కలు చూపించిన పంది… ఎక్కడికి వెళ్ళినా అతని వెంటే…!

-

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా సరే క్షణాల్లో మనకు చేరిపోతుంది అనేది వాస్తవం. తాజాగా ఒక ఆసక్తికర వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే… బిబిసి న్యూస్ కోస్టార్ కల్లెర్గిస్ గుడ్ మార్నింగ్ గ్రీస్ అనే న్యూస్ షో నుండి ఒక వీడియోను పోస్ట్ చేసాడు. ఆ వీడియో లో అక్కడ రిపోర్టర్ లాజోస్ మాంటికోస్ ఒక పందిని వెంబడిస్తూ వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి ఆ పంది అతన్ని అనుసరించడం మొదలుపెట్టింది.

లాస్ న్యూస్ షో కోసం గ్రీస్ లోని కైనెటాలో వరద వలన కలిగే నష్టాలను తెలుసుకోవడానికి ఒక బృందం వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక ఆడ పంది… రిపోర్టర్ ని అనుసరించడం మొదలుపెట్టింది. వరద స్థలంలో రిపోర్టర్‌ను పరిచయం చేసిన స్టూడియో జర్నలిస్ట్ జార్గోస్ పాపడాకిస్‌తో ప్రారంభమైన ఈ వీడియోలో లాజోస్, “గుడ్ మార్నింగ్, మాకు ఒక సమస్య ఉంది” అని చెప్తూ ఆ పంది అతని వెంట పడటాన్ని చూపిస్తాడు. “జార్గోస్, మీరు నా మాట వినగలరా? ఈ ఉదయం నుండి మమ్మల్ని వెంబడించే పంది ఇక్కడ ఉంది. చేసారో, క్షమించండి,

నేను నిలబడలేను (ఎందుకంటే) ఎందుకంటే ఇది నన్ను కొరుకుతోందని చెప్పగా స్టూడియో లో ఉన్న వారు నవ్వుని అదుపు చేసుకుంటూ ఉంటారు. #Kinetta #Greece #tv #bloopers #ant1tv #Ant1news అనే ట్యాగ్స్ తో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియో ని వివిధ సామాజిక మాధ్యమాల్లో 20 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. ఈ నెల 26 న జరిగిన ఈ సంఘటనపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పంది అతనితో ప్రేమలో పడింది అనుకుంటా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version