ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. గులాబ్ సైక్లోన్ పై ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ సర్కారు కు అన్ని విధాల సహకారం ఉంటుందని… తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ప్రధాని మోడీ. కాగా ఉత్తరాంధ్ర తీరం వైపు గులాబ్ తుఫాను దూసుకొస్తోంది.

శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మరింత బలపడి శనివారం సాయంత్రానికి గులాబ్ తుఫానుగా మారింది. ఈ గులాబ్ తుఫాన్ కారణంగా… ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల పై తీవ్ర ప్రభావం ఉన్నది ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఉత్తరాంధ్ర మరియు ఒడిస్సా లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ తుఫాను కారణంగా రేపు మరియు ఎల్లుండి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు స్పష్టంచేసింది వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version