పవన్ కల్యాణ్‌కు ఏపీ పోలీసులు షాక్‌.. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లోనే పవన్‌

-

బేగంపేట ఎయిర్ పోర్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమానాన్ని పోలీసులు నిలిపివేశారు. పవన్ కళ్యాణ్ స్వాగతించేందుకు నాదెండ్ల మనోహర్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీనే అని విమర్శించారు.

పోలీసుల లేఖను పరిగణలోకి తీసుకున్న గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులు పవన్ స్పెషల్ ఫ్లైట్ ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో పవన్ ప్రయాణించాల్సిన స్పెషల్ ఫ్లైట్ టేకాఫ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న పవన్ కల్యాణ్ స్పెషల్ ఫ్లైట్ ఇక్కడే నిలిచిపోయింది. విమానం నిలిపివేయడంతో బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి పవన్ కల్యాణ్ వెనుదిరిగారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ విజయవాడ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇక, పవన్ కల్యాణ్ విజయవాడ రాకుండా అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version