బావుల‌కు మీట‌ర్లుపై కేసీఆర్ చెప్పిన‌వ‌న్నీ అబద్ధాలే : కేంద్ర విద్యుత్ మంత్రి

-

వ్య‌వ‌సాయ బావుల‌కు మీట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని తాము ఏ రాష్ట్రంపై ఒత్తిడి తీసుకురాలేద‌ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. బావుల‌కు మీట‌ర్లు బిగించ‌డంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ చెప్పెవ‌న్నీ కూడా అబ‌ద్ధాలే అని అన్నారు. కాగ ఈ రోజు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్.. గ్రీన్ హైడ్రోజ‌న్, గ్రీన్ ఆమోనియా విధాన ప‌త్రాన్ని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు.
సౌర విద్యుత్ కొనుగోళ్ల పై, బావుల‌కు మీట‌ర్ల బిగించ‌డంపై రాష్ట్రాల పై కేంద్ర ప్ర‌భుత్వం ఒత్తిడి చేయ‌డం లేద‌ని అన్నారు. సౌర విద్యుత్ కొనుగోలు అంశం.. పూర్తిగా రాష్ట్రాల నిర్ణ‌యాల పైనే ఆధార ప‌డి ఉంటుంద‌ని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. సౌర విద్యుతు అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం కూడా ఉండ‌ద‌ని తెల్చి చెప్పారు. బ‌హిరంగ వేలం ద్వారానే సౌర విద్యుతును కొనుగోలు చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాలు కొనుగోలు చేశాయ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version