ఇందిరమ్మ ఇళ్ల పథకంను త్వరలో సీఎం ప్రారంభిస్తారు: పొంగులేటి

-

భద్రాద్రి లో రాములవారి సన్నిధి లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ను త్వరలో సీఎం ప్రారంభిస్తారు అని పొంగులేటి అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ రెవిన్యూ సెక్టార్ లో అవినీతి పూర్తిగా అంతరించాలని చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతాం అని పొంగులేటి అన్నారు. ఇప్పటికే సుమారు 22 వేల ఉద్యోగాల ఇచ్చాం అని అన్నారు.

అలానే మెగా డీఎస్సీ ని కూడా ప్రకటించాం, 11 వేల ఉద్యోగ నియామకాలను ఎన్నికల కోడ్ కు ముందుగానే చేపడతాం అని పీనుగులేటి అన్నారు. గత పద్దతులు మానుకుని ఇందిరమ్మ రాజ్యం లో ప్రజలకు మంచిచేసేల అధికారులు ముందుకు వెళ్ళాలి అని అన్నారు. ధరణి పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ లను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేలా మండల స్థాయి లో అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తాం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version