టీడీపీ వస్తే వాలంటీర్లను తొలగిస్తారు: పోసాని

-

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి మీద ప్రముఖ నటుడు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని మురళీకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. పురందేశ్వరి పని చేసేది బిజెపి కోసం కాదని టీడీపీ చంద్రబాబు కోసం అని అన్నారు. పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేడీ విలన్ అని ఆయన విమర్శించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లని తొలగించమని ఇప్పుడు ఇస్తున్న 5000 వేతనం కాకుండా పదివేలు ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలపై పోసాని స్పందించారు. చంద్రబాబు చెప్పే మాటల్ని వాలంటీర్లు నమ్మరని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే వాలంటీర్లను తొలగిస్తారని పేర్కొన్నారు చంద్రబాబు జీవితం అంతా ఇలానే బతుకుతున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version