ప్రభాస్ కోసం లైన్లో ఉన్న మరో బాలీవుడ్ దర్శకుడు..

-

ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలపై జనాల్లో ఎంత ఆసక్తి ఉందో అందరికీ తెలిసిందే. రాధేశ్యామ్ దగ్గర నుండి సలార్, ఆదిపురుష్ సహా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. సలార్, ఆదిపురుష్ చిత్రాలు చిత్రీకరణకి వెళ్ళాయి. నాగ్ అశ్విన్ చిత్రం ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే మొదలయ్యేలా ఉంది. మొత్తానికి ఈ సినిమాలన్నీ పూర్తవ్వాలంటే కనీసం మూడు సంవత్సరాలైనా పడుతుంది.

ఐతే అప్పుడే ప్రభాస్ నెక్స్ట్ చిత్రంపై ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్ కోసం కథ రెడీ చేసారని అంటున్నారు. వార్ సినిమాతో అందరినీ మెప్పించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ తర్వాతి చిత్రం ఉండనుందని వినిపిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా ఉండనున్నట్లు అంటున్నారు. మరి ఇది నిజమా కాదా అన్నది ప్రభాస్ కే తెలియాలి. అన్ని సినిమాల విషయాల్లో సడెన్ షాకులు ఇచ్చిన ప్రభాస్, ఈ సినిమా విషయంలోనూ అలాంటి షాకే ఇస్తాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version