ఆ పూజారి స్టైలే వేరు.. గుడికి వచ్చిన స్త్రీలతో శృంగారం..

-

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. గుడి లేదు.. బడి లేదు.. తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఏ చోటైన పర్వాలేదు. ఇలా ఉండి కామాంధుల తీరు. మంచి చెడులు చెప్పాల్సిన ఓ ఆలయ పూజారే.. కామావతరం ఎత్తి గుడికి వచ్చిన మహిళలను, యువతులను తన వశీకరణ శక్తితో లొంగదీసుకొని వారితో శృంగారంలో మునిగితేలుతున్నాడు. ఇది తెలుసుకున్న తన భార్య.. సదరు పూజారి ప్రశ్నిస్తే దాడి చేసి విడాకులు ఇవ్వాలంటూ నోటీసుల ఇచ్చాడు.. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. సదరు పూజారి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన తనకు 14 ఏళ్ల కిందట.. అనంతపురం జిల్లాకు చెందిన అనంతసైనతో పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అతని భార్య స్రవంతి తెలిపింది. ఏడేళ్లుగా మానసికంగా, శారీరకంగా హింసిస్తుండేవాడని, విషయం పెద్దలకు
చెప్పడంతో పలుమార్లు పంచాయితీలు కూడా పెట్టారన్నాని ఆమె వెల్లడించింది. ఆరు నెలల నుంచి దేవాలయానికి వచ్చే పలువురు యువతులు, మహిళలను లోబరుచుకుని వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు స్రవంతి పేర్కొంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, ఆడియో రికార్డులు తనకు దొరికాయని, ఇదే విషయమై తాను నిలదీస్తే చంపేస్తానని బెదిరించాడని స్రవంతి ఆరోపించింది. అంతేకాకుండా.. ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగించడంపై భర్తను నిలదీయగా.. తనపై దాడిచేసి పుట్టింటికి పంపించినట్లు.. అంతేకాక.. విడాకులు కావాలని న్యాయవాదితో నోటీసులు పంపించాడని పేర్కొన్నారు స్రవంతి. ఇదే విషయమై పెద్దమనుషులతో మాట్లాడేందుకు పుట్టింటి తరఫువారితో మంగళవారం ఉదయం మురడి గ్రామానికి వెళితే.. ఆలయంలో చర్చించకుండా బయట తోటకి తీసుకెళ్లి తన కుటుంబసభ్యులందరిపై దాడి చేయించినట్లు స్రవంతి ఆవేదన వ్యక్తం చేసింది. రాసలీలలకు అడ్డుపడుతున్నానన్న నేపంతో తనను హతమార్చేందుకు కుట్ర చేశారని ఆరోపించారు స్రవంతి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version