వివేకాను హత్య చేసింది వాళ్లే : వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు…

-

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం లేదని… అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే తనతో పాటు జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని సవాల్‌ విసిరారు.

కడప జిల్లాలోని ఎమ్మెల్యేలందరం కలిసి మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని… అవినాష్ రెడ్డినీ హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం తెరవెనుక చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. తనకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఎర్రగంగిరెడ్డి మరో ముగ్గురిని కలుపుని హత్య చేసేందుకు ప్లాన్‌ చేశారని… వివేకా హత్యలో పాల్గొన్నానని దస్తగిరి వాంగ్మూలం ఇస్తే అతన్ని ఇంతవరకు సీ బీ ఐ అధికారులు అరెస్ట్ చెయ్యలేదని ప్రశ్నించారు. హంతకుడిని సాక్షిగా మార్చమని సీబీఐ కోరుతోందని… వివేక హత్యకు ఎర్రగంగిరెడ్డి మూలమని తెలిపారు. ఎర్రగంగిరెడ్డి,దస్తగిరి..ఉమామహేశ్వర రెడ్డి, సునీల్ యాదవ్ మాత్రమే హత్య చేశారు.. అవినాష్ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version