నెల రోజులు నిరసనలు, ర్యాలీలు, సభలు బంద్ : నల్గొండ ఎస్పీ చందనా దీప్తి

-

నల్గొండ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు 30, 30(ఏ) పీడీ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జూన్‌ 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఈ యాక్ట్‌ ఉంటుందని వెల్లడించారు. కాబట్టి పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, పబ్లిక్‌ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎస్పీ సూచించారు.

శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని తెలిపారు. ఇట్టి విషయంలో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version