అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో పద్దును ప్రవేశపెట్టిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, అభివృద్ధే ముఖ్యమని స్పష్టంచేశారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా.. పారదర్శకత జవాబుదారీతనంలో ప్రభుత్వం సాగుతోందని అన్నారు. జోడు గుర్రాల సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని నమ్ముతున్నట్లు వివరించారు.
ప్రజాసంక్షేమమే తమకు ముఖ్యమని తెలిపారు. గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోని దాటేశామని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. హైదరాబాద్ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు మూసీ సుందరీకరణ, మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామని అన్నారు.