కేసీఆర్ ఒక టర్బో ఇంజన్…డబుల్ ఇంజన్ అవసరం లేదు -పువ్వాడ

-

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ మంత్రి అజయ్ కుమార్ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ అవసరం లేదని…సీఎం కేసీఆర్ ఒక టర్బో ఇంజిన్ అని వెల్లడించారు. తెలంగాణకు అన్యాయం చేసిన మోసం చేసిన మోడీ వంగి వంగి దండాలను ప్రజల నమ్మవద్దని కోరారు.

బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైంది.. మేం నీళ్లు ఇవ్వకుండానే.. పంట పండకుండానే లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నారా? పంజాబ్ తర్వాత ఎక్కువ వరి పండిన రాష్ట్రం తెలంగాణనే అని నీతి ఆయోగ్ కూడా చెప్పిందని పేర్కొన్నారు తెలంగాణ మంత్రి అజయ్ కుమార్.

మోడీ ఉపన్యాసం లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారని… కేసీఆర్ మాట్లాడిన విషయాల పై మోడీ స్పందించ లేదు. స్పందించలేడని చురకలు అంటించారు. కేసీఆర్ ప్రశ్నలకు మోడీ దగ్గర సమాధానం లేదని… శ్రీలంక ప్రభుత్వం పై మోడీ ఒత్తిడి తెచ్చారా లేదా చెప్పలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version