ప్రధాని మోడీ సభలో మంత్రి రోజా హల్చల్.. సెల్ఫీలు తీస్తూ !

-

ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పెద్ద అమరిన్ లోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు.

గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ర న్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి రోజా అలాగే కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, పురందరేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి రోజా స్టేజీపైన కాస్త ఓవర్‌ గా బిహేవ్‌ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్య మంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిలతో కలిసి.. సెల్ఫీ దిగింది మంత్రి రోజా.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక అంతకు ముందు రోజా మాట్లాడుతూ..ప్రధానితో పాటు వేదిక పంచుకోవటానికి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి అర్హత లేదని చురకలు అంటించారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా. అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాల సమయంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉండటం నా అదృష్టమని.. ఇవాళ దేశం అంతా అల్లూరి ధైర్య సాహసాలు, త్యాగం గురించి గుర్తు చేసుకుంటోందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version