కాసేపట్లో ఉద్యమ నేతలతో రాహుల్ భేటీ

-

తెలంగాణలో నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు కొనసాగుతుంది. నిన్న వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. నిన్న వరంగల్ సభ ముగిశాక.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకుని తాజ్ కృష్ణలో బస చేశారు. కాసేపట్లో తెలంగాణ ఉద్యమ నేతలతో హోటల్ లో సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన అల్పాహారం చేయనున్నారు. అనంతరం ఉదయం10 గంటలకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనవారితో హోటల్‌లోనే ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

11 గంటల 45 నిమిషాలకు సంజీవయ్య పార్కుకు వెళ్తారు. అక్కడే దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం12 గంటల 30 నిమిషాలకు చంచల్ గూడ జైలులో ఉన్న NSUI నేతలను కలిసేందుకు వెళతారు. ఒకటిన్నరకు గాంధీభవన్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలతో సమావేశమై.. పార్టీ అంశాలపై చర్చిస్తారు. 2 గంటల 45 నిమిషాలకు మెంబర్షిప్ కో ఆర్డినేటర్లతో భేటీ అవుతారు. సాయంత్రం రాహుల్ ఢిల్లీ బయల్దేరి వెళతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version