బిటౌన్ బ్యూటీస్ ను వదిలిపెట్టనంటున్న రామ్ చరణ్

-

యంగ్ మెగా పవర్ స్టార్ చెర్రీ… బిటౌన్ బ్యూటీస్ ను వదిలిపెట్టనంటున్నాడు.కెమిస్ట్ర్రీ అంటూ వర్కవుట్ చేస్తే ముంబాయి బ్యూటీస్ తోనే అంటున్నాడు.ఉన్నట్టుండి చెర్రీ ఎందుకిలా బాలీవుడ్ భామలతోనే ఎంగేజ్ అవ్వాలని చూస్తున్నట్లు.ఇప్పుడిదే అంశం టాలీవుడ్ లో ఆసక్తిరేపుతుంది.

రామ్ చరణ్ తేజ్ ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.మహాభలేశ్వరంలో జరుగుతున్న షెడ్యూల్ కు తన డేట్స్ ఎడ్జెస్ట్ చేశాడు.ఎట్ ది సేమ్ త్వరలో ప్రారంభమయ్యే ఆచార్య షెడ్యూల్ కు ప్రిపేర్ అవుతున్నాడు.ఐతే ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా చెర్రీని మనం చూడబోతున్నాం. ఎవడు తర్వాత ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్న పాత్ర ఇదే కావడం విశేషం.

ఆర్.ఆర్.ఆర్. లో చెర్రీకి జతగా అలియా భట్ నటిస్తుంది.బాలీవుడ్ బ్యూటీ కావడంతో గ్లామర్ విషయంలో కొంత ఎక్కువ కేరే తీసుకుంటున్నారు.గతంలో వినయవిధేయరామలో మరో బిటౌన్ బ్యూటీ కైరా అద్వానీతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చేశాడు.ఈ రెండు సినిమాలలో గ్లామర్ వర్కవుట్ అయింది.ఆ ఇదితోనే ఆచార్యలోను బాలీవుడ్ సుందరిని తీసుకురావాలని చూస్తున్నారు.

ముచ్చటగా మూడోస్సారి బాలీవుడ్ భామ అనేసరికి ఆ రోల్ చేసేది ఎవరు అనే టాక్ పరిశ్రమలో గట్టిగానే వినిపిస్తుంది.ఇప్పుడున్న టైమ్ లో బిటౌన్ స్టార్ హీరోయిన్ ను ఈపాత్రకు ఎంపిక అయిందనే టాక్ వినిపిస్తుంది.ఒకవేల అదే నిజమైతే ఆ వచ్చే హీరోయిన్ ఎవరు .జాన్వి కపూర్ ,కృతిసనన్,సారా ఆలీఖాన్ లలో ఎవరో ఒకరిని తీసుకుంటారని తెలుస్తుంది.ఒకవేల కొరటాల ఆవిషయంలో వారిని కూడా లైట్ తీసుకుంటే ఏ మలయాళి బ్యూటీనో వచ్చినా రావచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version