అయోధ్యలో దారుణం… 7 ఏళ్ల బాలికపై అత్యాచారం.

-

దేశంలో రోజుకు ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతున్నాయి. వావీ వరసలు మరిచి.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చాలా కేసుల్లో నిందితులు బాధితులకు దగ్గరివారే అవుతున్నారు. ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా.. అత్యాచారాాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా మరో ఘోరం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.

ఈ షాకింగ్ ఘటనలో ఏడేళ్ల బాలికపై బుధవారం గుర్తు తెలయని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన అయోధ్య కొత్వాలి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయోధ్య కొల్వాలి పీఎస్ పరిధిలో బాలికపై అత్యాచారం జరిగినట్లు అయోధ్య ఎఎస్పీ శైలేజ్ పాండే తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version