బెంగళూరులో ఓ ర్యాపిడో బైక్ రైడర్ రెచ్చిపోయి ప్రవర్తించాడు. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేయడంపై కస్టమర్ అతడిని ప్రశ్నించడంతో కోపంతో ఊగిపోయాడు. సదరు అమ్మాయిని బలంగా చెంపపై దెబ్బ కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. ఈనెల 14వ తేదీన జయ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రక్రియను కొనసాగించారు. అనంతరం ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కింది. కోర్టు తీర్పు ప్రకారం ఈరోజు నుంచి కర్ణాటకలో బైక్, ట్యాక్సీలపై నిషేధం అమలులోకి వచ్చింది.