Rashmi Gautham : రష్మీ గౌతమ్‌ ఇంట విషాదం…

-

తెలుగు స్టార్‌ యాంకర్ రష్మీ గౌతమ్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. రష్మీ గౌతమ్ కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తి కన్నుమూశారు. అది ఎవరో కాదు, గ్రాండ్ మదర్. ఆమెతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ చేశారు.

“మా గుండెలు బాధతో బరువెక్కాయి. మా కుటుంబమంతా కలిసి మా గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా గారికి చివరిసారిగా గుడ్ బై చెప్పాం. ఆమె చాలా ధైర్యవంతురాలు. మాపై ఆమె ప్రభావం చాలానే ఉంటుంది. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉండిపోతాయి. ఓం శాంతి” అంటూ పేర్కొంది రష్మీ గౌతమ్. ఆమెకు నెటిజన్స్ ధైర్యంగా ఉండాలని చెబుతూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news