ఏపీ వార్డు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు..జగన్‌ కీలక ఆదేశాలు

-

ఏపీ వార్డు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్‌ శాఖ పై సీఎం జగన్ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాలు, వార్డుల్లో…సబ్‌ రిజిస్ట్రార్‌ భవనం, సేవల పై అవగాహన కలిగించాలన్నారు.

cm jagan

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్‌ అందించాలని పేర్కొన్నారు సీఎం జగన్‌. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో…ఏయే రకాల డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్న విషయాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాను అప్‌గ్రేడ్‌ చేయాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version