రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి హౌజ్ అరెస్ట్

-

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై  కేసులు నమోదు చేయాలంటూ.. ఈరోజు కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇటీవల అస్సాం సీఎంపై కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఏ స్టేషన్ లో కూడా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో ఈరోజు అన్ని జిల్లాల ఎస్పీ, కమిషనరేట్ కార్యాాలయాలను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధం అయ్యారు. 

ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఎక్కడిక్కడ నిర్భందిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లను హౌజ్ అరెస్ట్ చేశారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం రేవంత్ రెడ్డి హైదరబావద్ కమిషనరేట్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్ ముందు ఆంధోళన, ధర్నా చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయి టీ కాంగ్రెస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. అస్సాం సీఎంపై కేసు నమోదయ్యే వరకు పోరాటం చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version