కేబినెట్ సబ్ కమిటీ తో రేవంత్ రెడ్డి భేటీ..!

-

ఈరోజు సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పలు అంశాల మీద చర్చించారు కాంగ్రెస్ హామీలైన ఆరు గ్యారెంటీ ల మీద అమలు గురించి చర్చించనున్నారు.

అలానే ఈ సమావేశంలో ఇప్పటికే అమలు చేస్తున్న రెండు గ్యారెంటీన్ లోని లోటు పాట్లను తెలుసుకుని రాబోయే రోజుల్లో వాటిని సరి చేసుకునే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల టైం లో ఇచ్చిన 6 గ్యారెంటీ ల హామీలని అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలని ప్రవేశపెట్టింది. మిగతా గ్యారెంటీలో మరో రెండు గ్యారెంటీలని అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version