సంక్రాంతి ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీకి రూ.107 కోట్ల ఆదాయం

-

సంక్రాంతి పండుగ నేపథ్యంలో… రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మంచి సేవలు అందించడమే కాకుండా… అదే రీతిలో వారం రోజుల వ్యవధిలోనే భారీ ఆదాయాన్ని ఆర్జించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఈ ఘనత సాధించింది ఈ సంస్థ. సంక్రాంతి సందర్భంగా అదనంగా 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.

షెడ్యూల్ బస్సుల తో పాటు అదనం గా 4 వేల బస్సులు నడిపిన సంస్థ… ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సేవలు అందించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. అంతే కాదు ఏకంగా రూ. 107 కోట్ల ఆదాయం రాబట్టింది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తరఫున ప్రయాణికులకు కృత జ్ఞతలు తెలిపారు. ముందు ముందు కూడా ఇలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రయాణికులు ఆదరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version