రిషబ్ పంత్ నుదుటికి ప్లాస్టిక్ సర్జరీ

-

శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ నుదుటికి వైద్యులు చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఈ మేరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ వెల్లడించారు. పంత్ ఫేస్ పై గాయాలు కావడంతో.. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పంత్ ని ఢిల్లీకి తరలించాలని అనుకున్నప్పటికీ.. చివరకు మ్యాక్స్ లోనే శస్త్ర చికిత్స చేసినట్లు పేర్కొన్నారు.

పంత్ ను వైద్యులు జాగ్రత్తగా చూసుకుంటున్నారని.. బీసీసీఐ అతడి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటుందని అన్నారు. పంత్ ఆరోగ్యానికి సంబంధించి నివేదికలను తెప్పించుకుంటూ అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డిడిసిఏ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version