చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఓ బినామీ – మంత్రి రోజా

-

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఓ బినామీ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది ఏపీ మంత్రి రోజా. విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ,జనసేనలపై ఫైర్ అయ్యారు. మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్న మమ్మల్ని పిచ్చి కుక్కలు అని టీడీపీ అంటోంది…వికేంద్రీకరణను అడ్డుకుంటున్న అచ్చన్నాయుడు వంటి టీడీపీ వాళ్లే గజ్జికుక్కలు అంటూ నిప్పులు చెరిగారు.

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బినామీ అని.. చంద్రబాబు ఎప్పుడు సమస్యల్లో వున్నా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారని ఎద్దేవా చేశారు. కలెక్షన్లు, షూటింగ్ లు, కంటెస్టు చెయ్యడానికి వైజాగ్ కావాలి కానీ రాజధానిగా పనికి రాదా…? అని నిలదీశారు  మంత్రి రోజా. ఎన్టీఆర్ ను అవమానించి…మరణానికి కారణం అయ్యిన బాబు…ఈ రోజూ ఆరాధ్యదైవం అనడం సిగ్గుచేటన్నారు. ఉతరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ప్రజలు తరిమి కొడతారని మంత్రి రోజా వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version