గవర్నర్‌తో మంత్రి సబిత, విద్యాశాఖ అధికారుల భేటీ

-

విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బిల్లుపై సందేహాలు నివృత్తి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం మంత్రికి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు గవర్నర్ ను కలిసేందుకు రావొచ్చని రాజ్ భవన్ సందేశం పంపింది.

ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు రాజ్ భవన్ చేరుకున్నారు. బిల్లుపై సందేహాలను నివృత్తి చేసేందుకు తమిళిసైతో భేటీ అయ్యారు బిల్లుపై చర్చలు జరుపుతున్నారు. మరికాసేపట్లో వర్సిటీల ఉమ్మడి నియామకాల బిల్లుపై నిర్ణయం వెలువడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version