సాయి పల్లవి.. మేము నీ వెనకే ఉన్నాం: ప్రకాష్ రాజ్

-

ఇటీవల కాశ్మీరి పండిట్స్, గోహత్యలపై నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తప్పు పడుతూ సోషల్ మీడియా వేదికగా పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బజరంగ్ దళ్ నాయకులు ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సాయి పల్లవి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

సమాజంలో ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని,అందరి ప్రాణాలు ముఖ్యమేనని అన్నారు. మతం పేరుతో చేసే హింసా మహాపాపమని వ్యాఖ్యానించారు. తన ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది ఇలాంటి వార్తలు సృష్టించారని అన్నారు. కాగా సాయి పల్లవి ఇచ్చిన వివరణ పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆమెకు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు.” మానవత్వమే అన్నిటికంటే ముందు.. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం” అని ఆయన రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version