సర్కారు వారి పాట మొదలయిపోయింది…

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశు రామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట పేరుతో సినిమా తెరెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాపై రకరకాల ప్రచారాలు ముందు నుండీ జరుగుతూనే ఉన్నాయి.

కరోనా కారణంగా చిత్రీకరణ ఇప్పటి దాకా మొదలు కాలేదు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ఈ విషయాన్ని ఈ సినిమాని తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ప్రకటించాయి. సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ లుక్ కి మంచి స్పందన వచ్చింది కూడా. చూడాలి మరి సినిమా షూట్ ఎప్పటికి పూర్తీ చేస్తారు అనేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version