BWF World Championships 2022: చిరాగ్‌- సాత్విక్‌ జోడీ సంచలన విజయం

-

ప్రపంచ ఛాంపియన్షిప్ లో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్ లో టీమిండియా స్టార్ ద్వయం చిరాగ్ శెట్టి, స్వాతిక్ సాయిరాజ్ రంకిరెడ్డి జపాన్ కు చెందిన యుగో కోబయాషి, టకురో హోకిని 24-22, 15-21, 21-14 తేడాతో ఓడించారు. ఈ నెల ప్రారంభంలో బర్మింగ్ హమ్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న వీరిద్దరూ తమ ఫామ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు.

జపాన్ వరల్డ్ నెంబర్ 2 జోడిపై వీరిద్దరూ గెలుపొందడంతో వీరి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక పోతే తొలి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. ఇరువైపులా విజయం దోబూచులాడింది. ఇక స్కోర్ లైన్ ను 22-22 గా ఉన్నప్పుడు చిరాగ్ మిడ్ కోర్ట్ నుంచి క్రాస్ ఆడి పాయింట్ సాధించడంతో తొలి గేమ్ భారత్ వశమైంది.

రెండో గేమ్ లో వీరు కాస్త వెనకబడ్డారు. స్కోర్ కార్డు 11-9 రీడింగ్ తో ఉన్నప్పుడు ఇంకా పుంజుకునే అవకాశాలున్నా, జపాన్ జోడి ఎటాకింగ్ గేమ్ ఆడి గెలుపొందింది. దీంతో మ్యాచ్ 1-1 తో సమమైంది. భారత్ మూడో గేమ్ మ్యాచ్ డిసైడర్ అయింది. మూడో గేమ్ లో భీకరంగా పుంజుకున్న సాత్విక్ చిరాగ్ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఈ గేమ్ గెలుపొందిన భారత జోడి ప్రపంచ ఛాంపియన్షిప్ లో పథకం కాయం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version