కేసీఆర్ కు షాక్ ఇస్తూ షర్మిల కీలక అడుగు

-

తెలంగాణా సిఎం కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ దూసుకుపోతున్న వైఎస్ షర్మిల ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచారు. సిఎం కేసీఆర్ లక్ష్యంగా ఈ మధ్య కాలంలో ఆమె చేసే ఆరోపణలు తెరాస ని ఇబ్బంది పెట్టే విధంగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆమె మరో కీలక అడుగు వేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు కూడా ఆమె అండగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. రేపు సిఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ పర్యటనకు వెళ్తారు. గన్ పార్క్ కి వెళ్లి నిరుద్యోగుల కుటుంబాలకు సంతాపం తెలియజేయనున్నారు. దీనితో ఏం జరగబోతుంది ఏంటీ అనేది ఆసక్తిని రేపుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version