KCR ఒక్కడినే తిడితే సరిపోదు..అందరినీ తిడతా – షర్మిల

-

KCR ఒక్కడినే తిడితే సరిపోదు..అందరినీ తిడతానంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది వైఎస్‌ షర్మిల. అవును..KCR ఒక్కడినే తిడితే సరిపోదు. ఆయనతో పాటు తిట్టాల్సింది అమ్ముడుపోయిన ప్రజాప్రతినిధులను, ప్రశ్నించాల్సింది పోయి డప్పులు కొడుతున్న పత్రికలను, అణచివేయబడుతున్నా.. యాద మరిచి నిద్రపోతున్న మేధావులను తిట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు, తిరగబడకుండా తిని తందనాలాడుతున్న భజన బృందాలను, నాదాక రాలేదు కదా అని నానపెడుతున్న నాయకులను తిట్టాలన్నారు. జనం తిట్టడం ఆపి తరిమేదాక తెచ్చుకోకముందే మేలుకుంటే మంచిదని వెల్లడించారు. అటు ‘మహానేత YSR పాలన తెస్తా’ అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదమని రేవంత్‌ పై ఫైర్‌ అయ్యారు షర్మిల. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు YSR గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరని విమర్శలు చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version