రూ.20 వేల కోట్లతో.. ప్రధాని పదవిని కొనేందుకు కేసీఆర్ తయారయ్యారు – షర్మిల

-

రూ.20 వేల కోట్లతో.. ప్రధాని పదవిని కొనేందుకు కేసీఆర్ తయారయ్యారని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS – బందిపోట్ల రాష్ట్ర సమితి అని.. బంగారు తెలంగాణ పేరిట రాష్ట్ర ఖజానాను దోచుకొని.. పార్టీ ఫండ్స్ అకౌంట్ లోనే రూ.1000 కోట్లకు పెంచుకొని.. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు కొనుకొంటున్న కేసీఆర్ గారు.. రేపు దేశ ప్రధాని పదవిని కొనేందుకు తయారయ్యారని ఫైర్‌ అయ్యారు.

విపక్ష పార్టీలకు చైర్మన్ ను చేస్తే.. రాబోవు ఎన్నికల్లో రూ.20వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్తున్నారట దొర గారు.. ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే మీకు… ఫైనాన్స్ కట్టడానికి డబ్బులు లేని మీకు .. ఈ సొమ్మంతా ఎక్కడిది? అని నిలదీశారు. కాళేశ్వరం కమీషన్లు.. కొడుకు రియల్ ఎస్టేట్ మాయలు.. బిడ్డ లిక్కర్ దందాలా ధనమేనా సారు?అధికారం చేతిలో ఉందని అవినీతికి పాల్పడి.. రాష్ట్రాన్ని దోచుకున్నారు. దాచుకున్నారు. ఇప్పుడు దాచుకున్న సొమ్ముతో దేశ ప్రధాని పదవిని కొనేందుకు చూస్తున్నావా దొర? దీనినే రాజకీయ వ్యాపారం అంటారు కాబోలు అంటూ ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version