BREAKING : లోటస్ పాండ్ చేరుకున్న షర్మిల.. విజయమ్మ నిరాహారదీక్ష విరమణ

-

BREAKING : వైఎస్‌ షర్మిల జైలు నుంచి లోటస్ పాండ్ చేరుకున్నారు. దీంతో విజయమ్మ నిరాహారదీక్ష విరమణ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, మీరు రుణమాఫీ చేస్తామన్నారు ఎందుకు చేయలేదని నిలదీశారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు లేకపోతే నేను ఉద్యోగ భృతి అన్నారని.. మీరు నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారని ఫైర్‌ అయ్యారు.

ఉచితంగానే ఎరువులు అన్నారు రిజర్వేషన్ అన్నారు, ఇలా ఒకటి కాదు రెండు కాదు కేసీఆర్ గారు ఈ అంశాలను గురించి మాట్లాడామని తెలిపారు. నర్సంపేటలో ఘోరాతి ఘోరంగా మా బస్సులను కాల్చరని.. ఎలాంటి గుండాలు ఉన్నారో చూడండి మీ టిఆర్ఎస్ పార్టీలో అని నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఉన్నది ఒకప్పుడు ఉన్నట్లు ఉద్యమకారులు కాదు ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు ఉన్న కార్యకర్తలు మొత్తం అందరూ ఉండాలన్నారు. మీ గుండాలు ఎంత బీభత్సం సృష్టించారో చూడండి..దీనిపై కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version