సిగ్గుతో తలదించుకోవాలి : కేటీఆర్ పై వైయస్ షర్మిల సంచలనం

-

వైయస్ షర్మిల మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఇలాగే అయినా సిరిసిల్లలో… నిన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ సంఘటనపై వైఎస్ షర్మిల కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.

“నిన్న ఇండ్లల్ల పనులు చేసుకుంటూ, దివ్యాంగుడైన భర్తను, ఇద్దరు పిల్లలను పోషించుకునే మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలంటే తాళి బొట్టు నమ్మి మరీ లక్ష రూపాయల లంచం ఇవ్వాలని అడిగిన అధికార్లకు సిగ్గుండాలి. మీకు జీతాలు వస్తలేవా లేక సరిపోతలేవా యథా మంత్రి తథా అధికారులు.తలదించుకో KTR” అంటూ ఫైర్ అయ్యారు షర్మిల.

“లక్ష రూపాయల రుణమాఫీని లక్షణంగా వదిలేసిన కేసీఆర్ గారు, రైతులను బ్యాంకర్ల దృష్టిలో రుణ ఎగవేతదార్లను, దొంగలను చేసి ఓట్లేసిన రుణం తీర్చుకొంటున్నారా? రుణమాఫీ కోసం ఎదురుచూసిన రైతులు ఈ రోజు రుణం కట్టలేక, వడ్డీ పెరిగిపోయి, ఆస్తులను బ్యాంకులు జప్తు చేసుకొనేవరకు తీసుకొచ్చారు కదా దొర?” అంటూ మరో ట్వీట్ లో నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version