ఎన్టీఆర్ సినిమాలో ఏఎన్ఆర్ స్థానంలో శోభన్ బాబు.. కారణం అన్నపూర్ణమ్మ..!

-

తెలుగు నాట సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. వెండితెరపైన రాముడిగా, శ్రీకృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఇలా రకరకాల పౌరాణిక పాత్రలు పోషించి..తెలుగు వారి ఆరాధ్యుడయ్యారు.

పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు సీనియర్ ఎన్టీఆర్ అన్న రీతిలో ప్రతీ ఒక్కరి భావించే పరిస్థితులను తీసుకొచ్చారు. అయితే, ప్యారలల్ గా ఏఎన్ఆర్ సైతం పౌరాణిక పాత్రలు పోషించారు. కానీ, ఎన్టీఆర్ కు ఉన్న ఆహార్యం వలన ఎక్కువ ఆదరణ లభించింది. అయితే, ఓ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఏఎన్‌ఆర్ నటించాల్సి ఉండగా, అన్నపూర్ణమ్మ వలన ఆ స్థానంలో శోభన్ బాబు నటించారు. అందుకు గల కారణాలు తెలుసుకుందాం.

తెలుగు సినిమాకు రెండు కళ్లు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి వెండితెరపైన పలు సినిమాల్లో నటించారు. వీరి మూవీస్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. కాగా ఒకానొక సమయంలో ఏఎన్ఆర్ (అక్కినేని నాగేశ్వరరావు) సతీమణి అన్నపూర్ణమ్మ ఏఎన్ఆర్ నుంచి ఒక మాట తీసుకుందట. ఇక నుంచి పౌరాణిక పాత్రలలో ఎన్టీఆర్ పక్కన నటించొద్దని అన్నదట.

ఏఎన్ఆర్ తన సతీమణికి ఇచ్చిన మాట వలన ఇక తాను ఎన్టీఆర్ సినిమాలో నటించబోనని చెప్పాడు. అలా ఏఎన్ఆర్ స్థానం శోభన్ బాబు నటించాల్సి వచ్చింది. ‘వీరాభిమన్యు’ సినిమాలో అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించాల్సి ఉండగా..అది మిస్సయింది. అభిమన్యుడి పాత్రను శోభన్ బాబు పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. ఈ మూవీ షూటింగ్ కు మేకర్స్ చాలా టైమ్ తీసుకున్నారు. గ్రాఫిక్స్ కోసం అప్పట్లోనే చాలా శ్రమించారు. అలా సినిమా కు మేకర్స్ పడ్డ శ్రమ వృథా కాలేదు. జనాలు పిక్చర్ ను విశేషంగా ఆదరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version