నందిగం సురేష్ కి షాక్.. రిమాండ్ పొడిగింపు..!

-

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరోసారి షాక్ తగిలిందనే చెప్పాలి. మహిళా హత్య కేసులో ఆయనకు రిమాండ్ ముగియగా.. పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో విచారణ మరింత సమయం కావాలని పోలీసులు కోరడంతో నందిగం సురేష్ కు కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నవంబర్ 04వ తేదీ వరకు నందిగం సురేష్ ను విచారించనున్నారు పోలీసులు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నాడు. 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో మరియమ్మ అనే మహిళా మరణించింది. ఆ గొడవ అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రోద్భలంతోనే జరిగిందని మహిళా బంధువులు ఆరోపించారు. మహిళా హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. నందిగం సురేష్ పేరును కూడా కేసులో చేర్చారు. అయితే అధికార పార్టీ ఎంపీ కావడంతో కేసు విచారణ ముందుకు కదలలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version