ఇంట్లో చిన్న గొడవతో 11 మంది విషం ఇంజెక్షన్లు చేసుకుని ఆత్మహత్య…!

-

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని డెచు పోలీస్ స్టేషన్ పరిధిలోని లోడా గ్రామంలో జరిగిన్ ఒక సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పాకిస్తాన్ లోని సింద్ ప్రాంతం నుంచి వలస వచ్చిన 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు ప్రతి ఒక్కరూ పాయిజన్ ఇంజెక్ట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు అని అధికారులు పేర్కొన్నారు.

అంతే కాదు విషం ఎక్కించుకున్న తర్వాత నిద్ర మాత్రలు వేసుకున్నారు అని గుర్తించారు. కుటుంబ సభ్యులందరూ- ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, మరియు ఐదుగురు పిల్లలు, వారి చేతుల్లో సిరంజి గుర్తులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ వివాదం ఈ విషాదానికి దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. 2015 లో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన ఈ కుటుంబం జోధ్పూర్ లోని లోడ్టా గ్రామంలోని డెచు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version