ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ట్రంప్ రావాలా…?

-

బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఘాటుగా జరుగుతుంది. విజయం కోసం ఎన్డియే, విపక్షాలు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. తాజాగా మహాకూటమి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆర్జెడి అగ్ర నేత తెజశ్వీ యాదవ్ మాట్లాడుతూ… బీహార్‌ లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేసారు.

నితీష్ కుమార్ గత 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించారు, కాని దీనికి ఇంకా ప్రత్యేక కేటగిరీ హోదా తీసుకు రాలేదు అని ఆయన ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వలేరు అని తెజశ్వీ యాదవ్ అని అన్నారు. కాంగ్రెస్ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా కేంద్రంపై విమర్శలు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version