Shruti Haasan : ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్న శ్రుతి హాసన్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రుతి.. ప్రస్తుతం హాలీడేస్ లో ఉంది. ప్రకృతి ఒడిలో పరవశించి పోతోంది.

ప్రకృతిలో శ్రుతి సేద తీరుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో శ్రుతి చాలా అందంగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్ లో చాలా బ్యూటీఫుల్ గా ఉంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

ఇక శ్రుతి ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు, పృథ్వీ రాజ్ సుకుమారన్ వంటి సూపర్ స్టార్ హీరోలు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version