వైజాగ్ లో ఘోరం.. విషప్రయోగంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి..!

-

నర్సీపట్నంలో ఒక దారుణమైన సంఘటన చోటుచేసుకుంది విష ప్రయోగంతో రత్న మాధురి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. గత కొన్ని నెలలుగా శేఖర్ అనే వ్యక్తి తో ఈమె ప్రేమలో ఉంది ఈనెల 27న తనని కలిసింది అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతో ఉన్న ఆ రత్న మాధురి ని శేఖర్ ఆమె ఇంటి దగ్గరికి తీసుకువచ్చి విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

ఈరోజు తెల్లవారుజామున విశాఖపట్నంలో ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈమె చనిపోయింది. ఈ క్రమంలో ప్రియుడు శేఖరే ఈ పని చేసాడు అని మృతురాలి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అతని పై రెండు రోజుల క్రితమే నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్సై సుధాకర్ ఈ సంఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version