జవాద్ ఎఫెక్ట్ : తుఫాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు..

-

ఏపీని ప్రస్తుతం జవాాద్ తుపాన్ భయపెడుతోంది. బంగాళా ఖాతలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటి వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వాయుగుండం చేరే అవకాశం ఉంది. వాయుగండం మరింత బలపడి జవాద్ తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాక తెలిపింది. ఈ నెల 4న ఉత్తరాంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.

కాగా.. తుఫాన్ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తం అయింది. ఉత్తరాంధ్ర, ఒడిశాల మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ వెల్లడించారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఈనెల 3, 4 తేదీల్లో రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version