వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానన్నాను: విరాట్ కోహ్లీ

-

వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా కొనసాగుతానని బీసీసీఐకి తెలుపానని స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ఒకవేళ సెలెక్టర్లు తాను సారథ్య బాధ్యతలు నిర్వర్తించలేనని భావిస్తే, నాకు ఎలాంటి సమస్య లేదని కూడా స్పష్టం చేశానన్నారు. ఈ విషయమై టీ20 కెప్టెన్సీపై బీసీసీఐతో చర్చించే సమయంలో వివరించానని కోహ్లీ పేర్కొన్నారు.

వచ్చే నెలలో సౌతాఫ్రికాతో భారత్ వన్డే, టెస్టు మ్యాచ్‌ల ఆడనున్నది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 19 నుంచి 23 మధ్య జరగనున్నది. ఆ తర్వాత జనవరి 26న సెంచూరియన్‌లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్నది. వన్డే, టెస్టు సిరీస్ కోసం టీమిండియా బుధవారం సౌతాఫ్రికా బయల్దేరి వెళ్లింది. అంతకుముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబయిలో మీడియాతో మాట్లాడారు.

టీ20 కెప్టెన్సీను వీడక ముందే ఆ విషయం బీసీసీఐకి తెలుపాను. నా దృక్పథాన్ని వివరించాను. నా నిర్ణయాన్ని బీసీసీఐ స్వాగతించింది. ఎలాంటి నేరం జరగలేదు. నా నిర్ణయాన్నిబీసీసీఐ స్వాగతించింది. ప్రగతిశీలమైన నిర్ణయంగా పేర్కొన్నది అని విరాట్ కోహ్లీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version