Zimbabwe Vs India : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

-

టీ20 ప్రపంచకప్ అనంతరం యువ భారత జట్టు జింబాబ్వే టూర్ కి వెళ్లింది. ఈ టూర్ లో భాగంగా మొదట 5 టీ20ల సిరస్ జరగనుండగా దీనికి శుభ్ మాన్ గిల్ కెప్టెన్సీ వహించనున్నాడు. కాగా హరహరే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఐపీఎల్ లో భీకర ఫామ్ చూపించిన యువ ప్లేయర్లు అయిన గిల్, ద్రూవ్ జురేల్, గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా వంటి యువ ప్లేయర్లకు ఈ జట్టులో స్థానం దక్కింది. కాగా వారి ప్రతిభను నిరూపించుకొవడం కోసం ఇది యువ ప్లేయర్లకు వచ్చిన సువర్ణావకాశంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ మ్యాచులో యువప్లేయర్లు ఏ విధంగా రాణిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్ (సి), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (W), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా(సి), డియోన్ మైయర్స్, జోనాథన్ కాంప్బెల్, క్లైవ్ మదాండే(W), వెస్లీ మాదేవెరే, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చతారా

Read more RELATED
Recommended to you

Exit mobile version